1
మత్తయి సువార్త 14:30-31
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు. వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు.
താരതമ്യം
మత్తయి సువార్త 14:30-31 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
మత్తయి సువార్త 14:30
కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు.
మత్తయి సువార్త 14:30 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
మత్తయి సువార్త 14:27
వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.
మత్తయి సువార్త 14:27 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
మత్తయి సువార్త 14:28-29
పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు.
మత్తయి సువార్త 14:28-29 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
మత్తయి సువార్త 14:33
అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
మత్తయి సువార్త 14:33 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
మత్తయి సువార్త 14:16-17
యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు. వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.
మత్తయి సువార్త 14:16-17 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
మత్తయి సువార్త 14:18-19
ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు. వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.
మత్తయి సువార్త 14:18-19 പര്യവേക്ഷണം ചെയ്യുക
8
మత్తయి సువార్త 14:20
వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
మత్తయి సువార్త 14:20 പര്യവേക്ഷണം ചെയ്യുക
ഭവനം
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ